బండారు ఆధ్వర్యంలో నలభైవేల ఆర్ధికసాయం

కొత్తపేట గ్రామ పంచాయతీ బొరుసు వారి సావరం గ్రామంలో ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించిన బొలిశెట్టి సత్తిబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి గ్రామ జనసేన కార్యకర్తలతో కలసి 40,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో కొత్తపేట పార్టీ ప్రెసిడెంట్ చోడపునేడి ఉమా మహేశ్వరరావు, 20వ వార్డ్ మెంబర్ మాచిరెడ్డి కొండలరావు, వర్రే నాగు, ఆనాల ధర్మయ్య, కుంపట్ల శ్రీను, మహాదశ బాబులు, తులా రాజు, కరీమ్, యెలిశెట్టి శివ, గవర బాబీ మరియు గ్రామ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.