రామగుండంలో జనసేన పార్టీ క్రీయశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ

రామగుండం నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రీయశీలక సభ్యత్వం పొందిన 175 మందికి రామగుండం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మూల హరీష్ గౌడ్ చేతుల మీదుగా నాయకులకు, కార్యకర్తలకు జనసేన పార్టీ క్రీయశీలక సభ్యత్వం కిట్ల అందించడం జరిగింది. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మూల హరిష్ గౌడ్ నాయకులతో మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేస్తున్నందున పార్టీని మరింత ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు అక్టోబర్ మూడవ తారీకు నుండి రామగుండం నియోజకవర్గంలో జనసేన పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తుందని ప్రచార రథాలు సిద్ధమవుతున్నాయని ఇక బలంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావుల మధు, రావుల సాయి కృష్ణ, రమేష్ రవీందర్ గౌడ్, పవన్, తదితరులు పాల్గొన్నారు.