కందులు దుర్గేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు

రాజమండ్రి: ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా జనసేన అధ్యక్షులు కందులు దుర్గేష్ జన్మదినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన కందులు దుర్గేష్ జన్మదినోత్సవ వేడుకలలో రాజోలు నియోజవర్గ జనసేన నాయకులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరరావు బొంతు, మలికిపురం మండలం ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాసరావు, మామిడికుదురు మండలం ఉపాధ్యక్షులు దొడ్డ జయరాం, రాజోలు మండల ఉపాధ్యక్షులు ఉల్లంపత్తి దర్శనం, రాజోలు మండల సంయుక్త కార్యదర్శిలు వాసంశెట్టి పృథ్వీరాజ్, సారనాల శీను, ఉల్లి శెట్టి లక్ష్మణరావు, మేడిచర్ల అబ్బులు, ముప్పర్తి నాని ప్రసాద్, నామన చంటి, రేఖపల్లి శ్రీనివాసరావు, కోళ్ళ బాబి తదితరులు పాల్గొన్నారు.