విస్సన్నపేట మండలంలో ఘనంగా క్రియాశీల సభ్యత్వ కిట్స్ పంపిణీ

ఉమ్మడి కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలో విస్సన్నపేట మండల అధ్యక్షులు షేక్ యాసిన్, ఆధ్వర్యంలో విస్సన్నపేట పంచాయతీ నుండి రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, పెన్నా కృష్ణా కో- ఆర్డినేటర్ రావి సౌజన్య సమక్షంలో జనసేనపార్టీ సిద్ధాంతాలు నచ్చి 60 కుటుంబాలు జనసేనపార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేనపార్టీ కార్యదర్శి మనుబోలు శ్రీనివాసరావుకి, మరియు తిరువూరు నియోజకవర్గ నాయకులకు విస్సన్నపేట మండల కమిటీ నాయకులకు వాసు, శ్రీకాంత్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం జరిగింది. విస్సన్నపేట మండలం అధ్యక్షులు యాసిన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి రావి సౌజన్య, జిల్లా కార్యవర్గం సభ్యులు మనుబోలు శ్రీనివాసరావు, బండ్రెడ్డి రవి, సీనియర్ నాయకులు తోట శ్రీనివాస్, సీనియర్ నాయకులు, మెగా ఫ్యామిలి వీరవిధేయుడు రావి శ్రీనివాస్, గంపలగూడెం మండల అధ్యక్షులు చింతలపాట్టి వేంకట కృష్ణ, తిరువూరు మండలం అధ్యక్షులు పర్సా పుల్లరావు, ఏ.కొండూరు మండలం అధ్యక్షులు లాకవాతు విజయ్, విస్సన్నపేట మండలం అధ్యక్షులు యాసిన్, తిరువూరు నియోజకవర్గం నాయకులు రెడ్డి సురేష్ నాయుడు, నందమూరి వేంకటేశ్వరరావు, పగడాల లక్ష్మణరావు, పసుపులేటి రవీంద్ర, తోట రామకృష్ణ, అడపా శ్రీనివాస్, మురళి, సతీష్ మరియు నాలుగు మండలాల జనసైన్యం వీరమహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు. మండలంలో క్రియాశీల వాలీంటిర్ కి అతిథులతో సన్మానించి, క్రియాశీల సభ్యత్వం పొందిన వారికి క్యీట్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి, వైసిపి ల నుండి పలువురు కార్యకర్తలను రాష్ట్ర, జిల్లా కార్యవర్గం చేతులమీదుగా జనసేన పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.