క్రీడల పట్ల ఆసక్తిగల యువకులను ప్రోత్సహించడానికి క్రీడాసామాగ్రి పంపిణీ

మాడుగుల: యువత క్రీడల్లో రాణించాలని జనసేన పార్టీ మాడుగుల నియోజకవర్గం నాయకులు రాయపురెడ్డి కృష్ణ అన్నారు. మండల జనసేనపార్టీ నాయకులు కుంచా అంజిబాబు సమాకూర్చిన వాలీబాల్ కిట్ ను గురువారం రాత్రి స్థానిక బ్రహ్మంగారి వీధిలో యువతకు కృష్ణ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ క్రీడల పట్ల ఆసక్తిగల యువకులను ప్రోత్సహించడానికి ఇప్పటికే పలుగ్రామాల్లో జనసేనపార్టీ తరపున క్రీడాసామాగ్రిని పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు మజ్జి ఈశ్వరరావు, రాజు, గోవింద, గణేష్, శ్రీను, సూర్య, మూర్తి, గంగూ నాయుడు, వరహాల రాజు, సూర్య, ముత్యాల నాయుడు, రఫీ, గబ్బర్ సింగ్, ఉమా మహేష్, తాత నాయుడు, గౌతం, రామానాయుడు, పాలవెల్లి నాగూరు, నాయుడు, కోటి, పైడ్రాజు, సోమేశు, లోకేష్ ,శివాజీ, తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.