ఆక్సిడెంటులో మరణించిన జనసైనికుని కుటుంబాన్ని పరామర్శించిన పోలిశెట్టి

రామచంద్రపురం పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు అబ్బిరెడ్డి నాగేశ్వరరావు బస్సు యాక్సిడెంట్ అయ్యి మరణించడం జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిసి అబ్బిరెడ్డి నాగేశ్వర రావు అకాల మరణానికి చింతిస్తూ సానుభూతిని తెలియజేయడం జరిగింది. ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన వివరాలు జనసేన పార్టీ ఆపీసుకి పోలిశెట్టి చంద్రశేఖర్ పంపించి వారితో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ 3 వ వార్డు కౌన్సిలర్ అంకం శ్రీనివాసరావు, అక్కిరెడ్డి శ్రీనివాసరావు, గుల్లెంకుల సతీష్, రాంబాబు నాయుడు తదితర జనసైనికులు వెళ్ళడం జరిగింది.