గజపతినగరం ఆసుపత్రిలో రోగులకు పళ్ళు, రొట్టెల పంపిణీ

గజపతినగరం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా 3వ రోజు, గజపతినగరం నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో సోమవారం గజపతినగరం ఆసుపత్రిలో రోగులకు పళ్ళు, రొట్టెల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్పిటల్లో మౌళిక సదుపాయాలు సరిగ్గా లేక పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, జనసేన ప్రభుత్వం వచ్చాక సరైన వైద్యం అందే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు డా.రవి కుమార్ మిడతాన, గజపతినగరం నాయకులు పండు, శ్రీను, మహేష్, చరణ్, శంకర్, చాలం, పీరు జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.