లక్ష్మీదేవిపల్లి మండలంలో పర్యటించిన వేముల కార్తీక్

కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి మండలంలోని జయశంకర్ కాలనీ, గిరిప్రసాద్ కాలనీ గ్రామాల్లో జనసేన కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జి వేముల కార్తిక్ పర్యటించి జయశంకర్ కాలనీలో సీసీ రోడ్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వారికి రాబోయే రోజుల్లో అండగా ఉంటామని తెలియచేశారు. అలాగే అసెంబ్లీ ఎన్నికలలో కొత్తగూడెంలో జనసేన పోటీ చేస్తునందున్న జనసేనకి ఓటు వేసి గెలిపించమని జనసేన నాయకులు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ సాదిక్ పాషా పవన్, బన్నీ కృష్ణ శికర్ అరవింద్, మధు తదితరులు పాల్గొన్నారు.