విద్యార్ధులకి పాఠ్య పుస్తకాలు పంపిణీ

పాలకొండ, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరుపునుంచి బాసూరు గ్రామ హైస్కూల్ లో ఉన్నటువంటి మూడవ తరగతి నుంచి పదివ తరగతి విద్యార్థులుకి నూతనంగా జనసేన పార్టీలోకి వచ్చినటువంటి షేక్ అజార్ 170 మంది విద్యార్థులు కు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ మరియు రైటింగ్ బుక్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం నీ ఉద్దేశిస్తూ జనసేన జానీ మాట్లాడుతూ ఒక మంచి జనసైనికుడిని జనసేన పార్టీలోకి తీసువచ్చే విధంగా ప్రయత్నం చేసిన జామి అనిల్ కి ధన్యవాదాలు తెలిపారు, జనసేన పార్టీలోకి వచ్చి రాగానే ఇలాంటి మంచి కార్యక్రమం చేసినటువంటి షేక్ అజార్ కి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఆలాగే విద్యార్థులు ఉద్దేశిస్తూ చక్కగా చదువుకోని ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఏ తల్లిదండ్రులు అయితే వేలిముద్రలుగా ఇంకా ఉన్నారో ఆలాంటి వారికి విద్యార్థులునే వారికి సంతకం పెట్టడం వచ్చేలా నేర్పాలని తెలియచేయడం జరిగింది. జనసేన పార్టీ అంటే ప్రజలుకు మంచి జరగాలి అనే ఉదేశ్యంతో ఇలాంటి కార్యక్రమంలు చెయ్యడం జరుగుతుంది. ఇంతటి మంచి కార్యక్రమానికి సహకరించినటువంటి స్కూల్ ఉపాధ్యాయులకు మరియు బాసూరు గ్రామ జనసైనికులకు పేరు పేరు నా అభినందనలు చెప్పడం జరిగింది.