చేనేత కార్మికుల సమస్యలను తెలుసుకున్న ఆమదాలవలస జనసేన

శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలో చేనేత కార్మికుల సమస్యలను నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో, జనసేన పార్టీ చేనేత విభాగం వైస్ చైర్మన్ ప్రియాంక ముఖ్య అతిథిగా, గడపగడపకు వెళ్లి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సమస్యలను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లి తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో మండల నాయకులు చిన్నం నాయుడు, రమణ, బాబూరావు, సంతోష్, శివ, వసంత, సురేష్, గణేష్ మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.