దివాకర్ రెడ్డి కి రూ. 100 కోట్ల జరిమానా

తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి మరో షాక్ తగిలింది. ఏపీ మైనింగ్ అధికారులు రూ.100 కోట్ల జరిమానా విధించారు. వంద కోట్లు కట్టకపోతే ఆర్ అండ్ ఆర్ చట్టం కింద ఆస్తులు జప్తు చేస్తామన్నారు. త్రిశూల్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని చెబుతూ ఏపీ మైనింగ్ డిపార్ట్‌మెంట్‌ ఆ మేరకు 100 కోట్లు జరిమానా విధించింది. ఒక వేళ దాన్ని పే చెయ్యకపోతే ఆర్ఎంఆర్ చట్టం కింద ఆస్తుల జప్తు చేస్తామంటున్నారు అధికారులు. యాడికి మండలం, కోనుప్పలపాడులో 14లక్షల మెట్రిక్‌ టన్నుల అక్రమ మైనింగ్ జరిగినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించే వందకోట్ల జరిమానా విధించినట్లు తెలుస్తోంది. అక్రమాలపై ఆరోపణలు రావడంతో దీనిపై గత కొన్ని రోజులు విచారణ జరుపుతున్నారు మైనింగ్ అధికారులు.