39వ డివిజన్ లో దివ్యాంగుల భరోసా యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ నాయకులు పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలమేరకు మావులూరి సురేష్ & రాగిణిల ఆధ్వర్యంలో 39వ డివిజన్లో దివ్యాంగుల భరోసా యాత్ర జరిగింది. ఈ యాత్రలో భాగంగా జనసేన పార్టీ శ్రేణులు దివ్యాంగులు గొర్ల సన్నీ, స్టీఫెన్, క్రిషన్తో కలిసి వారితో వారి సమస్యలపై చర్చించి భరోసానిచ్చే ప్రయత్నం చేసారు. దివ్యాంగులు భవిష్యత్తుపై బెంగతో భారంగా రోజులు వెళ్ళబుచ్చడం అమానుషమనీ, ముందుగా వారికి ఆలోపాన్ని అధిగమించే మానసిక మనోబలాన్ని అందచేయవలసిన బాధ్యత ప్రభుత్వనిదేనన్నారు. ఈ వై.సి.పి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే రాబోయే తరం నిస్తేజం అవుతుందనీ ఇది సమాజ శ్రేయస్సుకు మంచిది కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులూ ఆకుల శ్రీనివాస్, ముమ్మిడి కోటేశ్వరరావు, రాము తదితరులు పాల్గొన్నారు.