స్కాముపై చైతన్య యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో స్కాముపై చైతన్యం కార్యక్రమం తోట కుమార్ ఆధ్వర్యంలో కొండయ్యపాలెంలోని పురుషోత్తమ లాడ్జ్ పరిసర ప్రాంతంలో జరిగింది. ఈ సంధర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ పి.ఏ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు రోజుకొకటి బట్టబయలు చేస్తున్న ప్రభుత్వ అవినీతిలను తాము నాదెండ్లగారు మాట కాకినాడలో అందరినోట అనే నినాదంతో ప్రతిరోజూ చైతన్య యాత్రని చేస్తున్నామన్నారు. ఈ వై.ఎస్.ఆర్ ప్రభుత్వం జగనన్న ఇళ్ళు అనే కొత్త పధకాన్ని ప్రకటించడం, పిల్లలకు స్కూలు బ్యాగ్లు షూలు ఇస్తున్నామని ఒక పధకం, గేదెలు కొని పంపిణీ చేస్తున్నామంటూ ఇంకో పధకం ఇలా రక రకాల పేర్లతో అడ్డగోగుగా నిస్సిగ్గుగ వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారనీ తాము ఈ అవినీతిని ప్రజల్లో తీసుకెళ్ళి చైతన్యం చేస్తున్నామన్నారు. ఈ అవినీతి వై.సి.పి ప్రభుత్వానికి పాలించే అర్హతలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తోట కుమార్, అగ్రహారపు సతీషు, నగేష్, గరగ శ్రీనివాస్, మోనా కుమారి, కంచర్ల రమేష్, తోట కృష్ణ తేజ, తోరం చిరంజీవి, కరణం దుర్గాప్రసాద్, గుర్రం త్రిమూర్తులు, దుర్గాప్రసాద్, నందిపాటి రాము, కళ్యాణ్. కోటేశ్వరరావు, ముమ్మిడి గంగ తదితరులు పాల్గొన్నారు.