పవన్ కళ్యాణ్ మీద ఈగ వాలినా రాష్ట్రంలో మూడో ప్రపంచ యుద్ధమే: జనసేన రాష్ట్ర బీసీ నాయకులు ఎం.హనుమాన్

విజయవాడ పశ్చిమ, వైఎస్ఆర్సిపి నాయకులు భారీగా కుట్ర చేస్తుందని, పవన్ కళ్యాణ్ కి రక్షణ లేదని, మా జనసేన పార్టీ బీసీ నాయకునిగా తెలియజేస్తున్నాం తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి జెడ్ ప్లస్ సెక్యూరిటీ క్యాటగిరి పవన్ కళ్యాణ్ కి కల్పించాల్సిందిగా జనసైనికులు తరఫున, జనసేన నాయకుల తరఫున ఈ రాష్ట్ర ప్రజల తరఫున మేం కోరుకుంటున్నాం. కేవలం ఇది వైఎస్ఆర్సిపి కుట్రేనని నేను తెలియజేస్తున్నాను. ఈరోజున జగన్మోహన్ రెడ్డి రౌడీ రాజకీయం ప్రజలందరూ చూస్తున్నారు. మా నాయకుడి మీద గాని ఈగ వాలితే రాష్ట్రం అతలాకుతులమవుతుంది. వైఎస్ఆర్ సీపీ నాయకులకు మరీ మరీ హెచ్చరిస్తున్నాం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీద ఈగ వాలినా సరే వైఎస్ఆర్సీపీ నాయకులకి, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డికి తక్షణమే జనసేన సత్తా చూపిస్తాం. కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో నడుస్తున్న కుట్ర డీజీపీ ఈ ఘటన స్పందించి ప్రజల కోసం పోరాడే నాయకులకే రక్షణ లేని రాష్ట్రంలో సాధారణ ప్రజలకు, మహిళలకు వైఎస్ఆర్సి ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందా… రౌడీయిజం చేస్తుందా ? కేవలం రౌడీయిజం చేయడానికి అవినీతి చేయడానికి అధికారంలోకి వచ్చిందా? ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే పద్ధతిగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డికి. లేదు మేము ఇలాగే ఉంటాం, రౌడీయిజం చేస్తాం అంటే మాత్రం రానున్న రోజుల్లో తీవ్రంగా మీకు బుద్ధి చెబుతాం. ప్రజల కోసం కష్టపడే మా పవన్ కళ్యాణ్ కి తక్షణమే రక్షణ కల్పించవలసిందిగా తెలంగాణ ప్రభుత్వానికి మా విన్నపం. దయచేసి తెలంగాణ ప్రభుత్వం పోలీసులు పవన్ కళ్యాణ్కి రక్షణ కల్పించాల్సిందిగా మా జనసేన పార్టీ తరఫున మా జనసేన నాయకులు తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున కోరుకుంటున్నామని జనసేన రాష్ట్ర బీసీ నాయకులు, న్యాయవాది మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ జాయింట్ సెక్రటరీ ఎం హనుమన్ తెలిపారు.