న్యాయవాదుల రిలే నిరాహారదీక్షలకు సంఘీభావం తెలిపిన డిఎంఆర్ శేఖర్

అమలాపురం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం 27.2023 ని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలకు అమలాపురం నియోజకవర్గ పార్లమెంటరీ నాయకులు డిఎంఆర్ శేఖర్ సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ నాయకులు అడపా ప్రసాద్, నందెపు వెంకటేశ్వరరావు మరియు నియోజకవర్గ జనసేన నాయకులు లింగోలు పండు, జనసేన పార్టీ అమలాపురం పార్లమెంటరీ గౌరవ అధ్యక్షులు నల్లా శ్రీధర్, యాళ్ళ నాగ సతీష్, కంచిపల్లి అబ్బులు, కొప్పుల నాగ మానస, ఆర్డిఎస్ ప్రసాద్, నల్లా వెంకటేశ్వరరావు, మోటుపల్లి సూర్య కిరణ్ తదితరులు పాల్గొన్నారు.