జికె ఫౌండేషన్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఆహార నిధి

విశాఖ, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయంకై పేద ప్రజల ఆకలి నింపే ప్రయత్నంగా ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ‘ఆహార నిధి‘ కార్యక్రమం కెజిహెచ్ వద్ద శనివారం మధ్యాహ్నం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన జనసైనికులు నీలం రాజు గారికి, పసుపులేటి మోహన్ లకు ధన్యవాదాలు తెలిపా. ఈ కార్యక్రమం జనసేన పార్టీ సంయుక్త జికె ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనసేన దక్షిణ నియోజకవర్గం నాయకులు గోపి కృష్ణ(జికె) చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు మరియు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.