విజయవంతంగా గార మండలం పోర్టు కళింగపట్నం జనసేన పరిచయ వేదిక

శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం పోర్టు కళింగపట్నం పరిచయ వేదికకు గార మండలం జనసేన నాయకులు గుంటు శ్రీను పిలుపు మేరకు ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం నియోజకవర్గ ఇంచార్జ్ కోరాడ సర్వేశ్వరరావు, శ్రీకాకుళం జిల్లా వీరమహిళ ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి సయ్యద్ కాంతి శ్రీ పాల్గొన్నారు. కోరాడ సర్వేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ స్థాయి బలోపేతం కోసం జనసైనికులతో చర్చించి. ప్రతి గ్రామంలో కూడా మన పార్టీ జెండా ఎగురవేసేలా మనం కష్ట పడాలి అని జనసైనికులకు తెలియజేశారు. కాంతి శ్రీ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను జనసైనికులకు వివరిస్తూ… ఈ పరిచయ వేదికకు వచ్చిన ప్రతి ఒక్క జనసైనికులకు ధన్యవాదాలు తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నాయకులు ఉదయ్ శంకర్, గురుప్రసాద్, బాబాజీ, సాయి, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.