వైసిపి నాయకులుకు సవాల్ విసిరిన దోమకొండ అశోక్

విజయవాడ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసే వైసిపి నాయకులు అందరికీ ఒక సవాల్ విసురుతున్నానని జనసేన 7వ డివిజన్ నాయకులు దోమకొండ అశోక్. వైసీపీ నాయకులకు దమ్ముంటే మీ నాయకుడు జగన్ రెడ్డి ని ప్రజా సమస్యలపై, పవన్ కళ్యాణ్ తో ఓపెన్ డిబేట్ కి పంపించండి. ఎవరికి చిత్తశుద్ధి ఉంది. ఎవరు ప్రజల తరఫున నిలబడుతున్నారు అనేది ప్రజలే తేలుస్తారు. వారి శాఖల మీద అవగాహన లేని వైసిపి మంత్రులు పవన్ కళ్యాణ్ ని విమర్శించే అర్హత లేదు. 151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన పాపానికి పాలన పూర్తిగా మర్చిపోయిన వైసీపీ నాయకులు, ప్రజలకు మంచి చేసే పవన్ కళ్యాణ్ పై దిగజారి మాట్లాడి మరింత ప్రజల్లో చిన్నబోతున్నారు. మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చి కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తున్న జగన్మోహన్ రెడ్డి మహిళల ఉసురు పోసుకుంటున్నారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మహిళలు వైసీపీ నాయకులను కొట్టిన చెప్పు దెబ్బలు, చీపురు దెబ్బలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈసారి జనం వద్దకు ఓటు వేయమని వెళితే కచ్చితంగా వీరికి మూడినట్లే.

వైఎస్సార్చిపి నాయకులకు దమ్ముంటే, పార్లమెంటులో ప్రత్యేక హోదా, పోలవరం, కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేంద్రాన్ని నిలదీయాలి.
మీకు దమ్ముంటే ఉచితంగా ఇస్తానన్న కరెంటు ఉచితంగా ఇవ్వండి.
దమ్ముంటే మద్యపాన నిషేధం చేయండి.
దమ్ముంటే ఫ్రీగా ఇస్తానన్న ఇసుకని ఫ్రీగా ఇవ్వండి.
దమ్ముంటే మీరు అధికారంలోకి వచ్చాక ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలను రద్దు చేశారు అవి మళ్లీ ఇవ్వండి.
మీకు దమ్ముంటే ప్రజల్లో తిరగండి.
వైసీపీ పాలన చూస్తుంటే బ్రిటిష్ పాలన అనిపిస్తుంది.
రాష్ట్ర ప్రజలంతా వైసీపీని తరిమికొట్టడానికి, వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ ను చూడడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.