జనసేన నాయకుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించిన దోమకొండ అశోక్

విజయవాడ, పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన అడ్డుకోవడం హేయమైన చర్య. ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ కి వస్తున్న ప్రజా ఆదరణ చూసి వైఎస్ఆర్సిపి కుట్రలు చేస్తుంది. ప్రజల తరఫున పోరాడుతున్న పవన్ కళ్యాణ్ ని అనేక ఇబ్బందులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉన్న వైసిపి నాయకులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అని ఎందుకు గర్జించ లేదు? విశాఖ రైల్వే జోన్ కోసం ఎందుకు గర్జించ లేదు?
ఉత్తరాంధ్ర నుంచి ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం వెళుతుంటే ఎందుకు చోద్యం చూస్తున్నారు? ఉత్తరాంధ్ర సమస్యలు మీకు పట్టవా? వైసిపి మద్దతిచ్చిన గర్జన కార్యక్రమం విఫలమవడంతో జనసేన పార్టీపై కుట్రలు చేస్తున్న వైసీపీ. వైసీపీ దౌర్జన్యాలకు అధినేత పవన్ కళ్యాణ్ కానీ జనసైనికులు కానీ, వీరమహిళలు కానీ భయపడే ప్రసక్తే లేదు. వైసీపీ పాలన చూస్తుంటే బ్రిటిష్ పాలనలో ఉన్నట్లు ఉంది. పోలీసులు రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలి కానీ వైసీపీ కార్యకర్తల కాదు. పోలీసు వ్యవస్థను కూడా ఈ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తోంది ఇది పోలీసులు గమనించాలి. అమరావతి రాజధానికి మద్దతు తెలిపింది వైసిపి నాయకులు ఈరోజు విశాఖలో భూములపై కన్నేసి ఆక్రమించుకుని ప్యాలెస్ లు కట్టుకోవాలని ఆలోచనతో వికేంద్రీకరణ అని దొంగ నాటకాలు ఆడుతున్నారు. ప్రజలు గమనించి వైసిపి నాయకులను ఉత్తరాంధ్ర నుంచి తరిమికొట్టాలి, పాలన చేతకాక ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించాలి అని అన్నారు.