పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు కాజులూరు మండల అధ్యక్షులు బోండా వెంకన్న ఆధ్వర్యంలో బందనపూడి గ్రామంలో పెద్దలను కలసి, ఇంటింటికి పోలిశెట్టి చంద్రశేఖర్ పర్యటించడం జరిగింది. బందనపూడి గ్రామంలో గ్రామ పెద్దలకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్దాంతాలు పోలిశెట్టి చంద్రశేఖర్ గ్రామ ప్రజలకు తెలియజేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గం జనసేన నాయకులు జనసైనికులు పాల్గొనడం జరిగింది.