అగ్రహారంలో ఇంటింటి ప్రచారం

ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పట్టణం అగ్రహారంలో జనసేన పార్టీ ఇంటింటికి ప్రచారం సందర్భంగా రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజుని జానీబాషాపురం నుండి అగ్రహారం వరకు జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పూలదండలు, మేళతాలాలు, బాణసంచా కాల్చుతూ ఘన స్వాగతం పలికారు. ముందుగా అగ్రహారంలో వెలసిన గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అడుగడుగునా అశేష ప్రజాదరణతో ఇంటింటికి జనసేన పార్టీ సిద్ధాంతాలు ఎన్నికల గుర్తు గాజు గ్లాసును వివరిస్తూ ప్రజా ఆశీర్వాదాలతో ప్రచారం చేసారు. అనంతరం జనసేన నాయకులు కొండేటి రవి కుమార్ ఏర్పాటు చేసిన విందులో జనసేన నాయకులు,జనసైనికులు,వీరమహిళలు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శింగంశెట్టి నరేంద్ర, మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, పోకల ప్రభాకర్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదమరాజు శ్రీనివాసుల రాజు, గుణకల చిన్న, శివ, మరియు జనసేన పార్టీ నాయకులు చల్లా సుధాకర్, దీపు, శివ, హరి, ఆకుల చలపతి, గురివిగారి వాసు, కెఆర్, పివిఆర్ కుమార్, గణేష్, కిచ్చగారి శివయ్య, రాజా ఆచారి, చల్లా మధు, అబ్బిగారి గోపాల్, ఈశ్వర, బాలాజి, రాజేష్ వర్మ, శంకర్ రాజు, సాయి రాజు తదితరులు పాల్గొన్నారు.