రాచర్ల గ్రామంలో టీడీపీ, జనసేన, బిజెపిల ఇంటింటి ప్రచారం

సత్యవేడు నియోజకవర్గం: జనసేన ఇంచార్జ్ కొప్పల లావణ్య కుమార్ ఆదేశాలు మేరకు వరదయ్య పాలెం మండల అధ్యక్షులు అంబటి చిరంజీవి యాదవ్ అధ్వర్యంలో ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. టీడీపీ, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారిని సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించలి అని చేప్పడం జరిగింది. బీజేపీ, టీడీపీ, జనసేన, ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ గారిని కమలం గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించు కోవలన్ని చేప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరదయ్యపాలెం మండల సీనియర్ టీడీపీ నాయకులు మధునాయుడు, ధనంజయ నాయుడు, రాజేంద్ర నాయుడు, మురళీ నాయుడు, శివాజీ నాయుడు జనసేన పార్టీ ఉపఅధ్యక్షుడు తులసి రామ్ ప్రధాన కార్యదర్శులు వసంత్ కుమార్, కేశవ,
సంయుక్త కార్యదర్శులు పృధ్వి, పరశురామ్, కార్యకర్తలు భాగ్యరాజ్, రాజేష్, బాబు, గిరి బాబు, గురవయ్య, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.