వైసీపీ వారికీ 30 యాక్ట్ అమలు వర్తించదా..?

మదనపల్లి: వైసీపీకీ 30 యాక్ట్ అమలు వర్తించదా అంటూ జనసేన పార్టీ రాయలసీమ కోకన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి వన్ టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ నందు వినతి పత్రం అందజేయడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలు ఇతర ప్రజా సంఘాలు ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలియజేయాలని అనుకున్న ప్రతిసారి పోలీసు వారు 30 యాక్ట్ అమల్లో ఉందని మాకు అనుమతులు నిరాకరించి మాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు వైసీపీ నాయకులు కౌన్సిలర్లు ఇతర ప్రతినిధులు చట్టానికి వ్యతిరేకంగా మా నాయకుడు అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మను అవమానకర రీతిలో దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మదనపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున కోరారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, ఐటీ విభాగ నాయకులు జగదీష్, గడ్డం లక్ష్మిపతి, కుమార్, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.