సమస్యల పరిష్కారానికి ఇంటింటికి జనసేన

  • మేనిఫెస్టో కరపత్రాలను అందజేస్తున్న జనసేన నాయకులు

రాజంపేట, సమస్యల పరిష్కారానికి ఇంటింటికి జనసేన కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాజంపేట జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు. రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు జనసేన నాయకుడు తాళ్ళపాక శంకరయ్య ఆధ్వర్యంలో ఆదివారం రాజంపేట మండలంలోని పోలి అప్పారాజుపేట గ్రామ పంచాయతీలోని హత్యరాల, కమ్మపల్లె, పరుశురామపురం, ద్వారకా నగర్, అప్పారాజుపేట, పాతకాలనీ, కొత్త కాలనీ, గ్రామాలలో పర్యటించి జనసేన పార్టీ రూపొందించిన మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించి ప్రజలకు కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ, ఇంటింటికి జనసేన కార్యక్రమంలో భాగంగా 29వ రోజు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకొని జనసేన పార్టీ సిద్ధాంతాలను మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను ప్రజలకు క్షేత్రస్థాయిలో తెలియాలనే ఉద్దేశంతో సమస్యల పరిష్కారానికై ఇంటింటికి వెళ్లి వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన రావడం అభినందనీయమన్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కడపజిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బరాయుడు, జనసేన యువనాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు, జనసేన వీరమహిళ పోలిశెట్టి రజిత, జనసేన నాయకులు తాళ్లపాక శంకరయ్య, భాస్కర్ పంతులు, చంగల్ రాయుడు, వీరయ్య ఆచారి, మరియు జనసేన కార్యకర్తలు, జనసేన వీరమహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.