మరికొన్ని మండలాలకు పార్టీ అధ్యక్షుల నియామకం

జనసేన పార్టీ మండల కమిటీలకు అధ్యక్షుల నియామక ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో 403 మండలాలకు అధ్యక్షులను నియమించారు. చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో మరికొన్ని మండలాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. ఇందుకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు.