Madira: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, ఏపీజే అబ్దుల్ కలాం, సావిత్రి ఫూలే మహానుభావులే మనకు ఆదర్శం

జనసేన పార్టీ ఆధ్వర్యంలో మధిర నియోజకవర్గం బోనకల్ మండల కేంద్రంలో గవర్నమెంట్ కాలేజీలో జనసేన పార్టీ మధిర నియోజకవర్గం విద్యార్థి విభాగం కార్యనిర్వాహక సభ్యులు గంధం ఆనంద్ అధ్యక్షతన విద్యార్థులకు సూచనలు సలహాలు ఇస్తున్న మధిర నియోజకవర్గం జనసేన పార్టీ బాధ్యులు తాళ్లూరి డేవిడ్ మాట్లాడుతూ ఈ సమాజంలో జరుగుతున్న డ్రగ్స్ గంజాయ్ మద్యపానాలు స్త్రీల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు మరియు విద్యార్థి విభాగం నుండి ఒక మంచి ఆలోచనతో మంచి వ్యక్తిత్వంతో ఆలోచనా విధానాలు ఉన్నప్పుడే విద్యార్ధులు ఉన్నత శిఖరాలకు వెళ్తారని ఉదాహరణకి డాక్టర్ శ్రీ బిఆర్ అంబేద్కర్, శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం, శ్రీ సావిత్రి పూలే ఈ మహానుభావులే మనకు ఆదర్శమని, ఈ ఉదాహరణ తీసుకొని విద్యార్థులు ఆలోచనా విధానాలతో ముందుకు సాగాలని అదేవిధంగా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఈ సమాజం పట్ల వారి ఉన్నతమైన విశాలమైన వారి కుటుంబాన్ని వదిలిపెట్టి ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజాసమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ మనం ఉండాలని మాకు నేర్పించారు. శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా గురువారం మధిర నియోజకవర్గంలో జనసేన పార్టీ విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా విద్యార్థి విభాగం కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలు బోనకల్ మండలం నాయకులు ఎస్ కే జానీ పాషా, లక్కీ శెట్టి సాయి కుమార్, ఎస్.కె అఫ్జల్, కోసూరు అశోక్, ఎస్ కె బాజీ బాబా ,వేముల వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.