డా. పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా జనసేన న్యూ ఇయర్ వేడుకలు

పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో జనసేన న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ జనసేన న్యూ ఇయర్ వేడుకలకు పిఠాపురం నియోజకవర్గం మూడు మండలాల నుంచి అనేక గ్రామాల వారీగా ఇంచుమించు 12,000 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి జనసైనికుడికి డాక్టర్ శ్రీధర్ భోజనం ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జన సమూహాన్ని చూసిన డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సీఎం అయితే రాష్ట్రమంతా ఎంత పండగ జరుపుకుంటుందో, అంత పండగ వాతావరణం ఇక్కడ కనిపిస్తుంటే ఇంత జన సమూహాన్ని చూసి పట్టలేనంత ఆనందంగా ఉందని ఇదే ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు.