జనసేన-టిడిపి ప్రజావేదిక

కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం మండలం, కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో బాబు షూరిటీ-పవన్ గ్యారెంటీ ముగింపు కార్యక్రమంలో భాగంగా జనసేన-టిడిపి ప్రజావేదికను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి టిడిపి ముఖ్య నేతల ఆహ్వానం మేరకు మరియు కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన-టిడిపి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ బాల్యం రాజేష్ సూచనలతో బ్రహ్మసముద్రం మండలం జనసేన పార్టీ తరఫున మండల అధ్యక్షులు అంజినేయులు, మండల ఉపాధ్యక్షులు రాయుడు, మండల ప్రధాన కార్యదర్శులు గోవిందు, మండల కార్యదర్శులు క్యాతన్న, జనసేన కార్యకర్త తలారి బొమ్మేష్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.