32వ వార్డులో అభివృద్ధి పనులకు డాక్టర్ కందుల శంకుస్థాపన

  • వారాహి యాత్ర విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు
  • కొనసాగుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం

వైజాగ్ సౌత్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న వారాహి యాత్ర విజయవంతం కావాలని కోరుతూ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం 32వ వార్డు లో నిర్వహించిన పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా వినాయక గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వార్డులో భీమ్ నగర్, పూతివారి మాన్యం ప్రాంతాలలో రోడ్లు, ఆర్చి నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజ్ మాట్లాడుతూ 32వ వార్డును మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తాను చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని చెప్పారు. నియోజకవర్గంలో జనసేన పాగా వేయడం ఖాయమని స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న విజయవంతం కావాలని వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ గిరి, దక్షిణ నియోజకవర్గం జనసేన సీనియర్ నాయకులు అంతోని, గణేష్, సూరినారాయణ, అప్పారావు, అనిల్, గాజుల శ్రీను, ప్రసాద్, అప్పలరాజు, జానకి, మంగ, అరుణ, రాజేశ్వరి, సునీత, హేమ, వరలక్ష్మి, దుర్గ, కుమారి, కందుల బద్రీనాథ్, కందుల కేదార్నాథ్ తదితరులు పాల్గొన్నారు.