జనసేన పార్టీ పదవి కోసం కాదు ప్రజా సమస్యల కోసం: జమ్ము ఆదినారాయణ

చీపురుపల్లి నియోజకవర్గం, గరివిడి ఉత్తరాంధ్ర జనసేన పార్టీ కార్యాలయం ఏపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన చీపురుపల్లి నియోజకవర్గానికి చెందిన జమ్ము ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బుధవారం ఉత్తరాంధ్ర జనసేన పార్టీ కార్యాలయంలో గౌరవనీయులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ సమక్షంలో, సుంకు వెంకటేశ్వరరావు అధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా జమ్ము ఆదినారాయణ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి పేదవారికి అండగా నిలుస్తున్నారని చాల సార్లు విన్నాను, నేను చూసాను. జనసేన పార్టీ అనేది పదవి కోసం కాదు ప్రజలకోసం అని భావించి నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరడం జరిగింది అని తెలిపారు. అదేవిధంగా నాకు ప్రజా సేవ చేయడం చాలా ఇష్టమని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చీపురుపల్లి నియోజకవర్గ నాలుగు మండలాల జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.