యూఏఈ – ఎన్ఆర్ఐ జనసేన నాయకులతో డాక్టర్ పిల్లా శ్రీధర్ భేటీ

పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ ఇటీవల విదేశీ పర్యటనలో భాగంగా దుబాయ్ లో యూఏఈ-ఎన్ఆర్ఐ జనసేన నాయకులను కలవడం జరిగింది. ఈ సమావేసంలో జనసేన పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా పార్టీ కోసం ఏ విధంగా కలిసి పని చేయాలి, పార్టీ మరింత బలోపేతం అయ్యేలాగా ముందుకు దూసుకు వెళ్లే విధంగా చేయాల్సిన కార్యక్రమాల కోసం చర్చించుకోవడం జరిగింది. డాక్టర్ పిల్లా శ్రీధర్ పిఠాపురం నియోజకవర్గం జనసేన మరింత స్ట్రాంగ్ గా ఉందని, రాబోయే ఎలక్షన్ లో విజయం జనసేనదేనని, జనసేన పార్టీ కోసం మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని, జనసేన విజయమే మా లక్ష్యమని చెప్పడం జరిగింది. యూఏఈ జనసేన నాయకులు కూడా పార్టీ బలోపేతం కోసం తమవంతు సహకారం మరియు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ పోటీ చేస్తే లక్ష ఓట్ల మెజారిటీ తగ్గకుండా గెలిపించి చూపిస్తామని చెప్పినట్లు వెల్లడించారు.