అటవీ కార్మికుల ఆవేదన మీకు పట్టదా!!

  • తక్షణమే అటవీ కార్మికులకు న్యాయం చేయండి.. జనసేన

తిరుపతి: గత కొంతకాలంగా అటవీ కార్మికులు చేస్తున్న న్యాయమైన పోరాటం గురువారంతో వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్ని పార్టీలతో పాటు ప్రధానంగా జనసేన పార్టీ వారికి మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా అటవీ కార్మికుల ఆవేదన ఈ ప్రభుత్వానికి, టిటిడి అధికారులకు పట్టదా అని, తక్షణమే వీరికి న్యాయం చేకూరేలా చర్యలు చేపట్టాలని, తిరుపతిలో వారాహి యాత్ర పర్యటనలో ఈ సమస్యలపై మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళతామని వీరికి న్యాయం జరిగే వరకూ జనసేన పార్టీ అండగా ఉంటుందని జనసేన రాష్ట్ర, జిల్లా, పట్టణ నాయకులతో కలిసి నగర అధ్యక్షుడు రాజారెడ్డి తెలియజేశారు.