దేవరపల్లి రాజరాజేశ్వరికి నివాళులర్పించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

  • దేవరపల్లి రాజరాజేశ్వరి 13వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

పిఠాపురం మున్సిపల్ మాజీ చైర్మన్, దివంగత నాయకురాలు దేవరపల్లి రాజరాజేశ్వరి 13వ వర్ధంతిని పురస్కరించుకొని పిఠాపురం పట్టణం రాజా రామ్మోహన్ రాయ్ పార్కు ఆవరణలో గల దేవరపల్లి రాజరాజేశ్వరి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణానికి దేవరపల్లి రాజేశ్వరి చేసిన సేవలను డాక్టర్ పిల్లా శ్రీధర్ కొనియాడారు, అదేవిదంగా ఈ రోజుల్లో మనం చూస్తుంటే అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, అక్క చెల్లెలు కొట్టుకుంటున్నారు, అనుబంధానికి తోవ లేకుండా పోతున్న ఈ రోజుల్లో కూడా మన మేడిది శ్రీను గారు అక్క తమ్ముళ్ల ప్రేమ అనురాగాలకు ప్రతిరూపంగా ఆమె చనిపోయి 13 సంవత్సరాలు అవుతున్నా సరే ప్రతి సంవత్సరం పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేస్తున్న మేడిది శ్రీను గారికి డాక్టర్ పిల్లా శ్రీధర్ అభినందనలు తెలిపారు. ప్రతి సంవత్సరం రాజకీయ పార్టీలకు అతీతంగా అందర్నీ ఆహ్వానించడం, పిఠాపురం నియోజకవర్గంలోనే మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ గా మన దేవరపల్లి రాజరాజేశ్వరి గారిని, వారు చేసిన అనేక సేవా కార్యక్రమాలను గుర్తించుకోవడం చాలా మంచి విషయం అని డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు.