అమరుల త్యాగం మరువలేనిది.. తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జనసేన పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను బలిదానం చేసిన అమర వీరులను స్మరిస్తూ.. వారి త్యాగం మరువలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లెల సంతోష్, కొలుగూరి అనిల్, గాలిపెల్లి వినోద్, వొద్దమల్ల విజయ్, గుండా సాయి చంద్, బోయిని ప్రణీత్, మోరె శ్రీకాంత్, వొద్దమల్ల అజయ్, బుర్ర అజయ్ తదితరులు పాల్గొన్నారు.