శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, రాయవరం గ్రామం నందు శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో గుడి కమిటీ వారి ప్రేమ పూర్వక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా పాలుపంచుకున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ శ్రీరాములవారిని దర్శించుకుని మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం మనం ఇప్పుడు రాక్షస పాలనలో ఉన్నాము రాముడు రాక్షసుడిని సంహరించినట్లు ఈ వైసీపీ రాక్షస పాలన నుండి కాపాడే మన ముందున్న ఏకైక వ్యక్తి జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ ని రాబోయే ఎలక్షన్లో మనం జనసేన పార్టీని గెలిపించుకుని ఈ రాక్షస పాలన నుండి శ్రీరాముడు లాంటి పవన్ కళ్యాణ్ ద్వారా రాక్షస పాలన నుండి విముక్తి కలగాలని ఆ శ్రీరాముని కోరుకుంటున్నట్లు జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిమిత్తం 10116/- విరాళంగా అందించడం జరిగింది అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాలుపంచుకుని స్వామివారి ప్రసాదం స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కారపురెడ్డి వెంకటేష్, గుండ్ర నాగు, బెజవాడ శ్రీను, సిరిపిరెడ్డి తాతాజీ, పెనిపోతుల అజయ్, బెజవాడ శివాజీ, బావిశెట్టి దుర్గాప్రసాద్, వీసం మణికంఠ, గుండ్ర శ్రీను, దేవు శివ, కోరాకల వాసు, మాగాపు హరీష్, బెజవాడ నాని, జట్ల సాయి, మాదేపల్లి దుర్గాప్రసాద్, వీసం లోవ, కొత్త వీరబాబు, సిరిపిరెడ్డి రాజా, పెన్నం శివ సతీష్, జట్ల గణేష్, కూరాకుల శంకర్, కంద అరవింద్, శెట్టి నాగేంద్ర, సిరిపిరెడ్డి సురేష్, కారపురెడ్డి సురేష్, ఆలయ కమిటీ పెద్దలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.