బస్సు షెల్టర్ నిర్మాణం కోసం పనులను ప్రారంభించిన జనసేన

పోలవరం, జీలుగుమిల్లి మండలం, మడకంవారి గూడెం స్టేజి వద్ద రోడ్ సమస్యలు మరియు బస్సు షెల్టర్ సమస్యలపై ఇచ్చిన మాట ప్రకారం జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవి కుమార్, పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు, మండల అధ్యక్షులు పసుపులేటి రాము సమక్షంలో పనులను ప్రారంభించడం జరిగింది. గ్రామస్థులు ఈ మార్గంలో ఎన్నో ఇక్కట్లు పడుతున్నామని, ఇదే మార్గం నుంచి సుమారు 15 గ్రామాల ప్రజలు నిత్యం ప్రయాణిస్తారని, మహిళలు పిల్లలు వృద్దులు కూర్చోవడానికి కనీసం బస్సు షెల్టర్ కూడా ఏర్పాటు చెయ్యలేని పరిస్థితి అని, అధికారులు, అధికారపార్టీ నాయకులు చెయ్యలేని పని జనసేన నాయకులు చేస్తున్నారని, అధికార పార్టీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సిగ్గు పడాలని గ్రామస్థులు మండిపడ్డారు. గడ్డమనుగు రవికుమార్ కి చిర్రి బాలరాజుకి గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మల్లేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.