దుర్గామాత జాతర మహోత్సవంలో పాల్గొన్న డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం, దసరా మహోత్సవాలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం మోహన్ నగర్ నందు ఉన్నటువంటి దుర్గామాత అమ్మవారి ఆలయంలో జరిగిన దసరా ఉత్సవాలో భాగంగా గుడి కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిధిగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ అమ్మవారిని దర్శించుకుని జాతర నిమిత్తం అమ్మవారికి 2116/- రూపాయలు విరాళంగా అందించి జాతరలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పితాని కాశీ విశ్వనాథ్. ఉప్పులూరి దేవి శివకుమార్, కోళ్ల వీరబాబు, బంగారు అశోక్, పైల లక్ష్మణ్ కుమార్, గొర్లె మణికుమార్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.