మదనపల్లి జనసేన ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

మదనపల్లిలో జనసేన పార్టీ కార్యాలయం నందు రాయలసీమ కో కన్వీనర్ రాందాస్ చౌదరి అధ్యక్షతన మరియు జిల్లా ప్రధానకార్యదర్శి జంగాల శివరాం, పట్టణ అధ్యక్షుడు శక్తి జంగాల, పట్టణ ప్రధానకార్యదర్శి కావలి రెడ్డెమ్మ సమక్షతన పట్టణ ప్రధానకార్యదర్శి గండికోట లోకేష్ అధ్వర్యంలో.. జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ఉమ్మడి కార్యదర్శి మూడే వేణుగోపాల్ నాయక్, మూరే రమేష్, జైశేకర్, సురేష్, సుబ్రమణ్యం, సేభరీష్, శాంతమ్మ, చంద్రశేఖర్, సుమిత్ర, కానాల బాలు తదితరులు పాల్గొన్నారు.