రాముల వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, గోకివాడ గ్రామం నందు శ్రీ రాముల వారి గుడిని పునర్నిర్మాణం చేసి విగ్రహ ప్రతిష్టకు ముఖ్య అతిథులుగా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ విగ్రహ ప్రతిష్ట అనంతరం స్వామివారి అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొని, స్వామివారికి అన్నసంతర్పణ కార్యక్రమం నిమిత్తం 2116/- రూపాయలు విరాళంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అధిక సంఖ్యలో గోకివాడ జనసైనికులు, గ్రామ భక్తులు మరియు ప్రజలు పాల్గొనడం జరిగింది.