టిడిపి రాష్ట్రవ్యాప్త బంద్ కు డాక్టర్ పిల్లా శ్రీధర్ మద్దతు

పిఠాపురం నియోజకవర్గం: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులకు నిరసనగా జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ సూచనల మేరకు పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ తెలుగుదేశం పార్టీ చేపడుతున్న రాష్ట్రవ్యాప్త బంద్ కు మద్దతుగా నిరసన తెలపడం జరిగింది. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల ఈ వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ అక్రమంగా అరెస్టు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అని కనీసం వయసు కూడా గౌరవం ఇవ్వకుండా 73 సంవత్సరాల వయసులో కూడా ఆయన పట్ల వ్యవహరిస్తున్న తీరు వైసీపీ ప్రభుత్వం రాక్షస పాలనకు నిదర్శనం అని ఒక ఉన్నతమైన వ్యక్తి 14 సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబునాయుడు గారు అటువంటి వ్యక్తి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోసం పరితపించే ఇలాంటివారిని అక్రమంగా అరెస్టు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అని జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ పనుల మీద విజయవాడ మంగళగిరి ఆఫీస్ కి వెళ్తుండగా పోలీసు వారు ఎంత ఇబ్బందులు పెట్టారో మనం చూసాం లాంటి రౌడీ రాజ్యం రాక్షస పాలన నుంచి విముక్తి కలగాలంటే మన ముందు ఒకే ఒక ఆయుధం ఓటు రానున్న ఎలక్షన్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి జనసేన పార్టీని గెలిపించుకోవాలని డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియా ముఖంగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్స్ సర్పంచ్ గరగా సత్యనందరావు, బొజ్జ గోపికృష్ణ, గొల్లపల్లి శివ, మచ్చ శ్రీనివాస్, కంద చక్రబాబు, కొప్పుల చక్రధర్, బండి సత్తిబాబు, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.