వైసిపి మరియు టిడిపి పార్టీల నుంచి జనసేన పార్టీలోకి చేరికలు

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలంలో రాపాక గ్రామంలో 50మంది ఎస్సి సామాజిక వర్గానికి చెందిన వైసిపి మరియు టిడిపి కార్యకర్తలు రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర వహించిన సీతానగరం మండల అధ్యక్షులు కారిచర్ల విజయ శంకర్, మండల వైస్ ప్రెసిడెంట్ కేతా సత్యనారాయణ, వీరమహిళ కన్దికట్ల అరుణ కుమారి, ప్రధాన ప్రధాన కార్యదర్శి దుబాయ్ శ్రీను, చిడిపి నాగేశ్వరావు, రాజు, సాయి అందరిని జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ అభినందించడం జరిగింది.