రాజ్ న్యూస్ పాత్రికేయులు రామకృష్ణని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం, పాత్రికేయులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పట్టణానికి చెందిన రాజ్ న్యూస్ టీవీ ఛానల్ పాత్రికేయులు రామకృష్ణ గత రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలవడం జరిగింది. విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ రామకృష్ణ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ రామకృష్ణకు నిత్యావసర సరుకులను, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టులకు ఏ అవసరం వచ్చినా తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.