తిత్తి భూలోకం కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

  • అనారోగ్యం కారణంగా అకాల మరణానికి చింతిస్తూ తిత్తి భూలోకం కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, కోనపాపపేట గ్రామం నందు అనారోగ్యం కారణంగా మరణించిన తిత్తి భూలోకం కుటుంబాన్ని రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల దాసు మరియు మత్స్యకార నాయకులు పల్లెటి బాపన్న దొర సమక్షంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా (ఎండి జనరల్ మెడిసిన్) పరామర్శించి కుటుంబానికి మనోధైర్యం నింపడం జరిగింది. అనంతరం ఆ కుటుంబ అవసరాల నిమిత్తం ఒక నెలకు సరిపడా 50 కేజీల బియ్యం నిత్యవసర సరుకులు ఆర్థిక సహాయంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మత్స్యకార నాయకులు కంబాల దాసు, మత్స్యకార నాయకులు పల్లేటి బాపన్న దొ, పిరాది అప్పారావు, సురాడ గణేష్, పుక్కుల కుమార్, డి శ్రీను, బి స్వామి, సిహెచ్ రాజు, పి మారియా, ఏ సతీష్, మెరుగు మాన్నియ్య, మెరుగు సత్తియ్య, కొవ్వూరు అచ్చయ్య, మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.