అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలని జనసేన విద్యార్థి విభాగం వినతిపత్రం

కోదాడ నియోజకవర్గం: ఉమ్మడి నల్లగొండ జిల్లా, మునగాల మండలం పరిధిలోని ముకుందాపురం గ్రామంలో జాతీయ రహదారిపై తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత కొంత కాలంగా ఇలాంటి రోడ్డు ప్రమాదాలు కారణంగా 50 మందికి పైగా ప్రాణాలు కోలియారు. ఇప్పటికైనా ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా వెంటనే అండర్ పాస్ బ్రిడ్జి, లేదా ఫుట్వర్ బ్రిడ్జి నిర్మించాలని నేషనల్ హైవే అదారిటీ సంబందిత అధికారికి వినతిపత్రం అందచేసిన జనసేన పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు గోకుల రవీందర్ రెడ్డి. వారు సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు చేపడతాం అని చెప్పడం జరిగింది. లేని యడల ఈ సమస్యని పరిష్కరించే వరకు జనసేన పార్టీ పోరాడుతుంది. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గం నాయకులు మల్లెల సాయితేజ, శివాజీ, జనసేన విద్యార్థి విభాగం గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ పెంటల మహేష్, పొన్నం పవన్ తదితరులు పాల్గొనడం జరిగింది.