2024 ఎన్నికలలో 30,000 భారీ మెజారిటీతో కందుల దుర్గేష్ విజయం సాధిస్తారు: గెడ్డం నాగరాజు

రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం ప్రాంతంలో జన చైతన్య శంఖారావం కార్యక్రమం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ విజయయాత్రలో భాగంగా తూర్పుగోదావరి సంయుక్త కార్యదర్శి గెడ్డం నాగరాజు మిత్రబృందం జన చైతన్య శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్ని దండలు శాలువాలతో దుర్గేష్ ను సత్కరించారు. అనంతరం కందుల దుర్గేష్ మాట్లాడుతూ జన చైతన్య శంఖారావం కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యమని అడుగడుగునా సమస్యలను ప్రజలు తెలియపరుస్తున్నారని త్వరలోనే జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి సమస్యను పరిష్కరిస్తామని 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేనని పవన్ కళ్యాణ్ ని సీఎం చేయడమే ముఖ్య ఉద్దేశంగా ముందుకు సాగుతామని దుర్గేష్ తెలిపారు. అనంతరం గెడ్డం నాగరాజు మాట్లాడుతూ ఈసారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్ లో కందుల దుర్గేష్ ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఈసారి జనసేన విజయాన్ని అడ్డుకోవడం ఎవరికి సాధ్యం కాదని జన చైతన్య శంఖారావం విజయవంతంగా కొనసాగుతుందని ఈ యాత్రలో అడుగడుగునా ప్రజలు జనసేన పార్టీని స్వాగతిస్తున్నారని ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని సీఎం చేసే ముఖ్య ఉద్దేశంగా మరింత ముందుకు సాగుతామని గెడ్డం నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో రాజు, కుంది రాము, బాసరమణి దుర్గప్రసాద్, సత్తిబాబు, రమణ, సత్యనారాయణ, శీరపు దుర్గ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.