తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన డా. పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంట్ ఎంపీ సీటును కేటాయించిన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ ఉదయ్ శ్రీనివాస్ ని శాలువాతో సత్కరించడం జరిగింది.
అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉదయ్ శ్రీనివాస్ గారిని కాకినాడ ఎంపీగా అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉందని పిఠాపురం నియోజకవర్గంతో పాటు కాకినాడ పార్లమెంటు స్థానాన్ని గెలిపించుకోవడానికి కూడా మరింత కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి లక్ష ఓట్ల మెజారిటీతో పాటు ఎంపీగా కాకినాడ పార్లమెంటు స్థానంలో ఉదయ్ శ్రీనివాస్ గారికి కూడా అత్యధిక మెజారిటీ రావడానికి గట్టిగా కృషి చేస్తామని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్స్ సర్పంచ్ సీనియర్ తెలుగు దేశం నాయకులు జ్యోతుల సతీష్, ఎక్స్ సర్పంచ్ గరగా సత్యనందరావు, వీరం రెడ్డి అమర్, బోజ్జ గోపికృష్ణ, ఇంటి వీరబాబు, ఎక్స్ సర్పంచ్ కరెడ్ల తాతీలు, ఎక్స్ సర్పంచ్ ఎలిగొండ రాజారావు, ఎక్స్ సర్పంచ్ కుంపట్ల చల్లారావు, జవ్వది జోగేశ్వరరావు, దుడ్డు నాగు, రంగనాథం రాజు, బస్స నాగసత్తులు, జవ్వది గంగాధర్, కీర్తి చంటి మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.