ఇంటింటికీ జనసేన-తెలుగుదేశం-బీజేపీ త్రిశూల వ్యూహం

  • మూడు మండలాల్లో ఒకేసారి ముగ్గురితో కూటమి గెలుపు కోసం ప్రచారం
  • నియోజకవర్గంలో బత్తులకు బ్రహ్మరధం పడుతున్న ప్రజలు
  • దివాన్ చెరువు గ్రామంలో భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు

రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా జనసేన పార్టీ ఆశయాలు సిద్దాంతాలు ప్రజలకు చేరువచేస్తూ రాజానగరం నియోజకవర్గంలో రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో, ప్రతీ ఇంటికీ తిరుగుతూ.. ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. ప్రజా పరిపాలన తీసుకురావడానికి.. మన ఆశలకు, ఆకాంక్షలకు వారధి రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి జనసేన – తెలుగుదేశం-బిజెపి పార్టీలు బలపరచిన మన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారిని అఖండ మెజారిటీతో గెలిపించండి అని అభ్యర్దించిన జనసేన పార్టీ మహిళా సాధికార కమిటీ కో – ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో జనసేన- తెలుగుదేశం – బిజెపి పార్టీ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.