డా. బాబు జగ్జీవన్ రామ్ కు నివాళులర్పించిన వీరఘట్టం జనసేన

పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం బొడ్లపాడులో ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు.. భారతదేశ తొలి దళిత ఉపప్రధాని.. సమసమాజ స్థాపనకై కృషిచేసిన మహా కృషివలుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా బుధవారం జనసేన జానీ మాట్లాడుతూ.. ఆ మహనీయుడికి ఇదే మా నమస్సుమాంజలి. బాబు జగ్జీవన్ రామ్ కలలుగన్న బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎంతలా తపించి పోయారో అలాంటి ఆశయాలని నెరవేర్చాలి అంటే ఆంధ్రప్రదేశ్ కి సరికొత్త ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎంతో అవసరమని అందుకు జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడాలని దానికి అనుగుణంగా మేధావులు ప్రజలు కళాకారులు ఆలోచించి మన ప్రభుత్వం అధికారంలోకి తీసుకువచ్చే విధంగా ప్రతి ఒక్కరు పని చేయాలని జనసేన జానీ చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వీరఘట్టం మండల నాయకులు వండాన సాయికిరణ్, సతివాడ వెంకటరమణ, గర్భపు నరేంద్ర ఇతర జనసైనికులు పాల్గొన్నారు.