శ్రీరామనవమి మహోత్సవంలో పాల్గొన్న డా. పిల్లా శ్రీధర్

పిఠాపురం: శ్రీరామనవమి సందర్భంగా పిఠాపురం మండలం, కందరాడ గ్రామంలో జరిగిన శ్రీరామనవమి మహోత్సవంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పాల్గొన్నారు. శ్రీరాముని సీతమ్మవారిని డాక్టర్ పిల్లా శ్రీధర్ దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు, అభిమానులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిల్లా శివశంకర్, పిల్లా ముత్యాల రావు, పిల్లా వెంకటరమణ, సైతన ఆనంద్, పిల్లా వీర నాగేశ్వరరావు, పోతు నారాయణరావు, పిల్లా సూరిబాబు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.