శ్రీరామనవమి వేడుకలలో పాల్గొన్న శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామంలో శ్రీరామనవమి సందర్బంగా గ్రామంలో పలు చోట్ల ఉన్న రాముల వారి ఆలయాలను సందర్శించి శ్రీరాముల వారిని దర్శించుకున్న జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో- ఆర్డినేటర్ శ్రీమతి “బత్తుల వెంకటలక్ష్మి”, జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీల సీనియర్ నాయకులు పాల్గొన్నారు. లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరమైనది, తర తరాలకు ఆదర్శనీయమైనది… సీతారాముల ఆశీస్సులు ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని, ఆ దివ్యమూర్తులను ప్రార్థిస్తూ… జనసేన – తెలుగుదేశం – బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసైనికులకు, వీరమహిళలకు, ప్రజలందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.